క్రైమ్/లీగల్

భార్యను చంపిన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుబోలు, జూలై 2: కూతురు ప్రేమ, పెళ్లి వ్యవహరం భార్యకు ముందుగానే తెలుసునన్న అనుమానంతో ఓ భర్త భార్యను తలపై ఇనుపరాడ్‌తో కొట్టి హతమార్చిన సంఘటన మండల పరిధిలోని కొమ్మలపూడి సమీపంలోని పిడిఆర్ గార్డెన్స్ ఎదురుగా జాతీయ రహదారిపై అదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని అక్కంపేట గ్రామానికి చెందిన రాపూరు శ్రీనువాసులు, అతని భార్య వెంకటరమణమ్మ (40) స్థానిక కోదండరామపురంలో నూడిల్స్ దుకాణంతోపాటు ట్రక్కు ఆటోను నడుపుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత నెల రోజుల క్రితం వనజాక్షి కలిచేడుకు చెందిన ఓ దళిత యువకుడు సాయిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ విషయం భార్యాభర్తల మధ్య వివాదానికి దారితీసింది. కూతురు ప్రేమ వ్యవహరం ముందుగానే భార్యకు తెలుసునని భర్త అనుమానంతో ప్రతిరోజు గొడవ పడేవాడు. ఆదివారం ఇరువురూ కలిసి నెల్లూరులో కూతురును చూడడానికి ట్రక్కు ఆటోలో వెళ్లారు. ఈ సమయంలో వెంకటరమణమ్మ తన కూతురు వనజాక్షికి సెల్‌ఫోన్ ద్వారా సమాచారం అందించింది. ఇరువురు ఆమెతో మాట్లాడారు. ఈ సమయంలో వెంకటరమణయ్య వనజాక్షితో మాట్లాడుతూ ఈ పెళ్లి ఎలా చేసుకున్నావని ప్రశ్నించగా అన్ని విషయాలను పెళ్లికి రెండు నెలలు ముందుగానే అమ్మకు చెప్పానంటూ సమాధానం రావడంతో అతడి అనుమానం మరింత బలపడింది. అక్కడ నుండి ట్రక్కు ఆటోలో ఇంటికి బయలుదేరారు. ఈసమయంలో ఇద్దరు వాదులాడుకుంటూ వస్తు మార్గమధ్యంలో ఆటోను పిడిఆర్ గార్డెన్స్ వద్ద నిలిపివేసి రిపేరు చేయాలని కిందకు దిగు అని చెప్పి దిగాడు. భార్యపై కోపంతో ఉన్న శ్రీనువాసులు వెంటనే ఇనుపరాడ్డు తీసుకుని భార్య వెంకటరమణమ్మ తల, భుజం తదితరచోట్ల గట్టిగా కొట్టడంతో ఆమె అక్కక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే నిందితుడు శ్రీనువాసులు స్థానిక పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని జరిగిన సంఘటనను పోలీసులకు చెప్పి లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న గూడూరు రూరల్ సిఐ అక్కేశ్వరరావు స్థానిక ఎస్‌ఐ శ్రీనువాసులురెడ్డితో కలిసి సోమవారం వేకువజామున వెళ్లి సంఘటన స్థలం, మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.