క్రైమ్/లీగల్

భార్యను గొంతు కోసి హతమార్చిన కసాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలేశ్వరం, జూలై 2: భార్యపై అనుమానంతో కత్తితో గొంతు కోసి చంపిన ఒక కసాయి భర్త ఉదంతం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. దీనికి సంబంధించి ప్రత్తిపాడు సీఐ ఏ శ్రీనివాసరావు, ఏలేశ్వరం ఎస్సై ఎం అప్పలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం లింగంపర్తి మేదరవీధిలో నివాసముంటున్న గ్రంధి ఈశ్వరరావుకు అడ్డతీగల గ్రామానికి చెందిన రొత్తా పాపయ్య, వీరలక్ష్మి దంపతుల కుమార్తె అయిన స్వరూపరాణి (20)తో రెండు నెలల క్రితం వివాహమైంది. అయితే ఈశ్వరరావుకు స్వయానా మేనత్త కూతురైన స్వరూపరాణి అంటే ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యులు, పెద్దల బలవంతంతో వివాహం చేశారని తెలిపారు. ఈశ్వరరావు ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో కాకినాడ మార్కెట్‌లో మేక మాంసం వ్యాపారం చేసి తిరిగి లింగంపర్తి వస్తుండేవాడు. ఈ నేపథ్యంలో అతను స్వరూపరాణిపై అనుమానంతో ప్రవర్తించేవాడని తెలిపాడు. ఈ క్రమంలో సోమవారం ఈశ్వరరావు అతని భార్య స్వరూపరాణిని నిద్ర లేపి ఆటాడుకుందామని చెప్పి ఆమె ముఖంపై గుడ్డ కప్పి కత్తితో పీక కోసి పారిపోయినట్టు పోలీసులు చెప్పారు. విషయం తెలుసుకున్న స్వరూపరాణి తల్లి వీరలక్ష్మి హుటాహుటిన లింగంపర్తి చేరుకుని కూతురిని చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఏలేశ్వరం తహసీల్దారు ఎం రవీంద్రకుమార్, వీఆర్వో రంగారావు శవ పంచనామా నిర్వహించారు. వీరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. కాగా ఈశ్వరరావు పరారీలో ఉన్నట్టు ఎస్సై అప్పలనాయుడు చెప్పారు.