క్రైమ్/లీగల్

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరాపురం, జూలై 2: మండలంలోని వలస గ్రామానికి చెందిన జయరాజు (62) అనే రైతు అప్పుల బాధ తాళలేక ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గమనించిన చుట్టు ప్రక్కల వారు వెంటనే పరశురాంపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి చెళ్ళకెర ప్రభుత్వాసుపత్రికి తరిలించేలోపు మృతి చెందాడు. మృతుడు ఇటీవల బోరు బావి తవ్వించి రూ. 3.75లక్షలు అప్పులు చేశాడు. అనంతరం ఇతరుల నుండి మరో రూ. 2.25లక్షలు అప్పు తీసుకున్నాడు. డ్వాక్రా సంఘాల ద్వారా మరో లక్ష రూపాయలు అప్పు చేసి బిడ్డకు వివాహం చేశాడు. అప్పుల బాధ అధికం కావడంతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎమ్మెల్యే ఈరన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వపరంగా జయరాజు కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎస్సై దిలీప్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.