క్రైమ్/లీగల్

తహశీల్ ముందు గిరిజన రైతు ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దవూర, జూలై 2: పెద్దవూర మండల తహశీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి మందు గిరిజన రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం జరిగింది. మండల పరిధిలోని పులిచర్ల గ్రామ పంచాయతీలోని బావుసోనుబాయి తండాకు చెందిన రమావత్ రాంబాబు వారసత్వంలో తన వాటా అయిన రమావత్ జాను 4 ఎకరాల 7గుంటల భూమిని గత 5 సంవత్సరాలుగా కాపుకాస్తు తన పేరు మీద పట్టా మార్పిడి చేయటం లేదని అధికారులు, కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. దీంతో నెలల తరబడి తిరిగినప్పటికి పట్టించుకోవటంలేదని మనోవేదనకి గురైన రమావత్ జాను అందరు చూస్తుండగా ఆత్మహత్యయతానికి పాల్పడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే అక్కడ ఉన్న రైతులు తహశీల్దార్ ఉడవేల్లి హుస్సేన్‌కు కార్యాలయ సిబ్బంది రాంబాబు చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు.