క్రైమ్/లీగల్

ప్రాణం తీసిన పందెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూలై 2: ఇద్దరు స్నేహితుల మధ్య బెట్టింగ్ ఓ యువకుని ప్రాణం తీసింది. ఈత రాక చెరువులో మునిగి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిదిలో జరిగింది. పోలీసుల కధనం ప్రకారం రవి నిజాంపేట్ గ్రామ పంచాయతీలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తాడు. గ్రామంలోని ఆలయం వద్ద 15 మంది స్నేహితులకు రవి విందును ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీలో పనిచేసే మహేశ్ (30), మల్లిఖార్జున్ సరాదాగా చెరువులో దిగి ఈత కొడితే రూ. 10 వేలు ఇస్తానని పందెం కట్టారు. ఈ మురికి నీళ్లలో నేను ఈదలేనని నీవు ఈదితే మరో రూ.2 వేలు కలిపి రూ.12 వేలు ఇస్తాను అని అన్నాడు. సుమారు గంటసేపటికి మల్లిఖార్జున్ వెళ్లిపోయాడు. మహేశ్ చెరువులో దిగి నీటిలో చేతులెత్తి అరుస్తూ ఉండడం హరిబాబు అనే వ్యక్తి చూశాడు. వెంటనే ప్రక్కనే ఉన్న రాంబాబుకు చెప్పగా వారిద్దరూ నీళ్లలోకి దిగి మహేశ్‌ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ హరిబాబుకి ఈత రాకపోవడం, రాంబాబు నీళ్లలోకి వెళ్లడానికి భయపడడంతో మహేశ్‌ని బయటకు తీసుకురాలేకపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మహేశ్ మృతదేహాన్ని వెలికితీశారు.