క్రైమ్/లీగల్
చెట్టుపై నుండి పడి గిరిజనుడు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 3 July 2018
కొయ్యూరు, జూలై 1: ప్రమాదవశాత్తు చెట్టు పై నుండి పడి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ టెంకలపణుకుల గ్రామానికి చెందిన మత్స్యల హనుమంతరావు(40) అనే గిరిజనుడు ఆదివారం మృతి చెందాడు. ఈమేరకు కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అంతాడ పంచాయతీ టెంకల పణుకుకు చెందిన హనుమంతరావు గురువారం పనసకాయలు కోసేందుకు చెట్టెక్కాడు. కాలు జారి కింద పడడంతో తీవ్రంగా గాయపడిన అతన్ని వైద్య సేవలకై ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవలకై విశాఖ కేజీహెచ్కు తరలించారు. కాగా వైద్య సేవలు పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.