క్రైమ్/లీగల్

హత్య కేసు నిందితుడికి జీవితఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరంట్ల, జూలై 3 : కిరోసిన్ పోసి నిప్పంటించి మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడికి అదనపు సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించినట్లు ఎస్సై సుధాకర్‌యాదవ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు గోరంట్ల మండ లం పాలసముద్రంకు చెందిన రామాంజినప్ప అదే గ్రామానికి చెందిన వితంతువు నారాయణమ్మతో సహజీవనం సాగించేవాడు. ఇరువురి నడుమ డబ్బు విషయమై గొడవలు జరగడంతో 2015 ఫిబ్రవరి 19న ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నారాయణమ్మ ఇచ్చిన మరణవాంగ్మూలం మేరకు సీఐ శ్రీ్ధర్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు. కేసును పరిశీలించిన అదనపు జిల్లా జడ్జి రామంద్రమూర్తి నిందితుడికి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్సై వివరించారు.