క్రైమ్/లీగల్

రైలు కింద పడి డిగ్రీ విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, జూలై 3 : అనంతపురం ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న రాజవర్మ (21) ఫెయిల్ అయినందుకు మంగళవారం రైలు కింద పడి మృతి చెందిన సంఘటన ప్రసన్నాయపల్లి వద్ద చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు కూడేరు మండలం మరుట్ల గ్రామానికి చెందిన రాజవర్మ పరీక్షలలో ఫెయిల్ కావడంతో గత మూడు రోజులుగా మనోవేదనకు గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బంధువులు, పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న రైల్వే కీ మ్యాన్ ప్రసాద్ పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి ఆత్మహత్య
యాడికి, జూలై 3 : మండల కేంద్రంలోని ఆసుపత్రి కాలనీలో మధుబాషా (28) మంగళవారం విష గుళికల మందు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు, కుటుంబీకులు తెలిపారు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు కర్నూలు జిల్లా రామాపురం గ్రామానికి చెందిన మధుబాషా ఏడు సంవత్సరాల క్రితం యాడికిలోని కుళ్లాయమ్మతో వివాహమైంది. వీరు కర్నూలు జిల్లాలోని కనకాద్రీపల్లిలో నివాసం ఉంటున్నారు. భార్య ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పుట్టిళ్లు యాడికికి రాగా మధుబాష కూడా రెండు రోజుల క్రితం వచ్చాడు. ఈనేపథ్యంలో మంగళవారం గుళికలు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మృతుడికి గతంలో కడుపునొప్పి ఉండేదని పోలీసులకు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.