క్రైమ్/లీగల్
చెట్టును ఢీకొన్న కారు .. మహిళ మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 4 July 2018
చేబ్రోలు, జూలై 3: ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం... సోమవారం రాత్రి రేపల్లె నుంచి గుంటూరు వైపు కారులో కె నాగమణి (35), కుమారుడు రోహిత్, భర్త సాయిగిరిధర్ వస్తున్నారు. మార్గమధ్యలో చేబ్రోలు-నారాకోడూరు మధ్య కారు అదుపుతప్పి చింతచెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో నాగమణి అక్కడికక్కడే మృతిచెందగా రోహిత్, సాయి గిరిధర్లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఈ మేరకు చేబ్రోలు పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.