క్రైమ్/లీగల్
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 5 July 2018
గార్లదినె్న, జూలై 5 : మండల పరిధిలోని పెనకచర్ల డ్యాం గ్రామానికి చెందిన బోయ నాగేంద్ర (29) గురువారం పురుగుల మందు తాగి గురువారం మృతి చెందినట్లు ఎస్ఐ రాంప్రసాద్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నాగేంద్ర కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడేవాడు. బుధవారం రాత్రి కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన బంధువులు 108 వాహనం ద్వారా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్ఐ రాంప్రసాద్ తెలిపారు. మృతునికి భార్య, కూతురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.