క్రైమ్/లీగల్

బైక్‌ను ఢీకొన్న లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గండేపల్లి, జూలై 5: దేవుని ప్రార్థనకు వెళ్లి మృత్యువాత పడిన భార్యాభర్తల ఉదంతమిది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. బుధవారం రాత్రి గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన భార్యాభర్తలు ముత్యాల ధనరాజు (61), అతని భార్య అనంతలక్ష్మి (58)లు ప్రార్థన కోసం నీలాద్రిరేవుపేట గ్రామానికి మోటారుసైకిల్‌పై వెళ్లారు. ప్రార్థన అనంతరం తిరిగి ఇంటికి వెళుతుండగా బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో రాజమహేంద్రవరం నుంచి జగ్గంపేట వైపు వెళుతున్న లారీ వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానికులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించే సమయంలో అనంతలక్ష్మి మృతి చెందింది. చికిత్స పొందుతూ భర్త ధనరాజు గురువారం ఉదయం మృతి చెందాడు. ఎంతో అన్యోన్యయంగా ఉండే భార్యాభర్తలు ధనరాజు, అనంతలక్ష్మిల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరణంలోనూ కూడా బంధాన్ని వీడలేదంటూ స్థానికులు పేర్కొంటున్నారు. మృతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమార్తెలున్నారు. వీరందరికీ వివాహాలు కాగా, భార్యాభర్తలు ఇరువురూ ప్రత్యేకంగా ఉంటున్నారు. వీరి మృతితో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. గండేపల్లి ఎస్సై దుర్గాశ్రీనివాస్ సంఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేయగా, ఏఎస్సైలు పాల్, సత్యనారాయణలు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.