క్రైమ్/లీగల్

నాలుగు లక్షల విలువైన గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోలుగుంట, జూలై 5: మండలంలోని నిండుగొండ జంక్షన్ వద్ద గురువారం తెల్లవారు జామున నాలుగు లక్షల రూపాయల విలువైన గంజాయి పట్టుబడింది. ఈసంఘటనలో ముద్దాయిల నుండి 80 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకుని కారును సీజ్ చేసారు. వారి నుండి నాలుగు సెల్‌ఫోన్లు, 33 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈసంఘటనకు సంబందించి ఎస్సై హరికృష్ణ అందించిన వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దేవాడ సురేష్, హరిబాబు, తమిళనాడు రాష్ట్రానికి చెందిన గణేష్ బిజలాయ్‌తో పాటు మండలంలోని బుచ్చింపేట గ్రామానికి చెందిన గాలి బాలరాజులు టాటా ఇండికా కారులో గంజాయిని గురువారం తెల్లవారు జామున తరలిస్తున్నారు. ఎస్సై హరికృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు నిండుగొండ జంక్షన్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈకారును అనుమానించి తనిఖీ చేయగా అందులో 80 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లుగా వారు కనుగొన్నారు. దీంతో పై నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసారు. గంజాయి తరలించేందుకు ఉపయోగించిన కారును సీజ్ చేసి వారి వద్ద ఉన్న నాలుగు సెల్‌పోన్లు, 33 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నలుగురు వ్యక్తులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్సై హరికృష్ణ పేర్కొన్నారు.