క్రైమ్/లీగల్

ఐదుగురు కౌన్సిలర్లపై కిడ్నాప్ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, జూలై 5: పట్టణం రైల్వేస్టేషన్ ఏరియా 18వ వార్డుకు చెందిన కౌన్సిలర్ లింగంపల్లి రాములును కిడ్నాప్ చేసినట్టు కౌన్సిలర్ క్యాంపు నిర్వాహకుడు 21వ వార్డు మహిళా కౌన్సిలర్ మునిమంద స్వరూప భర్త రమేష్‌తోపాటు, వైస్ చైర్మన్ నూనెటి సత్యనారాయణ, కౌన్సిలర్లు చిట్యాల మధు, జిలకర వాసు, తోడే వంశీ కృష్ణారెడ్డిలపై కిడ్నాప్ కేసు నమోదు అయిందని బెల్లంపల్లి 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ రాజు తెలిపారు. ఆయన కథనం ప్రకారం మున్సిపాలిటీలోని 18వ వార్డు కౌన్సిలర్ లింగంపల్లి రాములును కౌన్సిలర్ల క్యాంపు నిర్వహిస్తున్న 21వ వార్డు కౌన్సిలర్ మునిమంద స్వరూప భర్త రమేష్ 4వ తేదీ తెల్లవారు జామున కిడ్నాప్ చేశారని తెలిపారు. అదేరోజున రాత్రి 8గంటలకు రాములు కొడుకు లింగంపల్లి శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ రాజు తెలిపారు.
నా భర్తను కిడ్నాప్ చేయలేదు
*రాములు భార్య లక్ష్మి వివరణ
తన భర్త అయిన లింగంపల్లి రాములును ఎవరు కిడ్నాప్ చేయలేదని అతని భార్య లింగంపల్లి లక్ష్మి గురువారం విలేఖరులకు తెలిపారు. మూడురోజుల క్రితం ఇంటి నుండి ఉదయం ఆరు గంటల సమయంలో బయటకు వెళ్లారని ఆమె తెలిపారు. ఆయనను ఎవరు కిడ్నాప్ చేయలేదని ఎటు వెళ్లాడో తెలిదని, ఫోన్ చేస్తే స్పందించడం లేదని ఆమె సమాధానం చెప్పారు.