క్రైమ్/లీగల్

ప్రేమ పేరుతో విద్యార్థిని కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జూలై 5: ప్రేమించిన అమ్మాయిని కిడ్నాప్ చేసే యత్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని బోదనపు శే్వత (24) చికిత్స పొందుతూ ఐదు రోజులు మృత్యువుతో పోరాడి గురువారం మృతి చెందింది. బొడిగె భరత్ ప్రేమించమని వేధింపులకు గురి చేసి హత్య చేశారని మృతురాలి తండ్రి చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలలోకి వెళ్తే... నల్లగొండ జిల్లా కొత్తపల్లికి చెందిన మధుసూదన్‌రెడ్డి కుమార్తె బోదనపు శే్వత చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులోని అశోకా ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నారు. నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలుకు చెందిన బొడిగె భరత్ శే్వతను ప్రేమిస్తున్నాడు. ఇటీవలే శే్వతకు వేరే అబ్బాయితో సంబంధం కుదిరింది. నిశ్చతార్ధం కూడా జరిగింది. ఈ విషయం తెలుసుకున్న భరత్ అమ్మాయిని దక్కించుకోవాలని పథకం వేసాడు. గత నెల 30న ఎంబీఏ పరీక్ష రాసేందుకు శే్వత అశోకా ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చారు. దీంతో భరత్ బైక్‌పై వచ్చి అమ్మాయిని బలవంతంగా ఎక్కించుకోని హైదరాబాద్ వైపుకు వెళ్లే ప్రయత్నం చేసాడు.
తప్పించుకునే ప్రయత్నంలో బైక్ పైనుంచి శే్వత కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడటంతో చికిత్స కోసం హయత్‌నగర్‌లోని సన్‌రైస్ ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలవ్వడంతో ఐదు రోజులు మృత్యువుతో పోరాడి మరణించింది. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి మధుసూదన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని సీఐ వెంకటయ్య దర్యాప్తు చేస్తున్నారు.