క్రైమ్/లీగల్

వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, జూలై 5: వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పటన్‌చెరు మండలం బీడీఎల్ భానూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. గుర్తు తెలియని భార్యాభర్తల మృతదేహాలు రింగ్ రోడ్డు డివైడరు వద్ద పడి ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు పోలీసులు అందించిన ప్రకారం క్రింది విధంగా ఉన్నాయి. రామచంద్రాపురం మండలం వెలిమెల గ్రామ శివారులలోని ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో డివైడరు వద్ద ఇద్దరు మృతి చెందినట్లు ఉన్నారని పోలీసులు కనుగొన్నారు. రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు అధికారి రఘు గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో డ్యూటీ నిర్వహణలో భాగంగా కొల్లూరు గ్రామం నుండి ముత్తంగి వైపు వస్తుండగా రింగ్ రోడ్డు మధ్యలో వృద్ధ దంపతుల మృతదేహాలు కనిపించాయి. విషం తీసుకుని వృద్ధులు ఇరువురు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వృద్ధులైన భార్యాభర్తలకు సంబంధించిన సమాచారం ఇంత వరకు పోలీసులకు లభించలేదు. వృద్ధుడి వయస్సు సుమారు 70 సంవత్సరాలు, వృద్ధురాలి వయస్సు 65 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అతని శరీరంపై తెల్ల రంగు షర్టు, తెల్లరంగు బనీను ఉండగా వృద్ధురాలి శరీరంపై పింక్ కలర్ చీర, నల్లరంగు జాకెట్ ఉన్నాయి. అనుమానాస్పదంగా మృతి చెందిన వారిపై పెట్రోలింగ్ ఇన్‌చార్జి రఘు ఫిర్యాదు మేరకు బీడీఎల్ భానూర్ పోలీసులు కేసు నమోదు చేసారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటన్‌చెరులోని వంద పడకల ఆసుపత్రికి తరలించారు.