క్రైమ్/లీగల్

చేపల లోడు లారీ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 6 : చేపల లోడుతో వెళుతున్న ఒక లారీ అదుపు తప్పి బోల్తా పడటంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. పెదపాడు మండలం వీరమ్మకుంట నుంచి చేపల లోడుతో ఏలూరు వచ్చేందుకు ముప్పర్రు మీదుగా శుక్రవారం లారీ బయలుదేరింది. కొద్దిదూరం వచ్చిన అనంతరం రోడ్డు అధ్వాన్నంగా ఉండడం, అదుపు తప్పి బోల్తా పడింది. దీనితో లారీ బురదలో బోల్తాపడటంతో లారీపై ప్రయాణిస్తున్న భీమడోలు మండలం గుండుగొలనుకుంట గ్రామానికి చెందిన లలిత లక్ష్మణ్ (35), పంజా (34) అక్కడికక్కడే మృతిచెందారు. కాగా గొర్రెల నాగరాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో అతన్ని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన జరిగిన వెంటనే పెదపాడు తహశీల్దార్ జిజె ఎస్ కుమార్, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, పెదపాడు పోలీసులు హుటాహుటిన వెళ్లి బురదలో పడిపోయిన లారీని జెసిబి సహాయంతో బయటకు తీయించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనలో గాయపడిన నాగరాజును ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పెదపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.