క్రైమ్/లీగల్

కన్న పేగే కాలయముడిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నారావుపేట, జూలై 20: క్షణికవేశం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. కన్న పేగే చివిరికి కాలయముడిగా మారాడు. చిన్న విషయంలో తలెత్తిన సమస్య తండ్రిని చంపే వరకు తీసుకవచ్చాడు ఒక తనయుడు. వివరాల్లోకి వేళ్తే బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాపయ్యపేటకు చెందిన మెర్గు సంజీవ (55) పద్మల కుమారుడు నర్సయ్య హైదరాబాద్‌లో ఒ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం తన సొంత ఊరు పాపయ్యపేటకు వస్తూ తన వెంట తినడానికి చికెన్ తెచ్చుకున్నాడు. చికెన్ వండు అంటూ తల్లికి పలుమార్లు చెప్పిన ఆలస్యం చేస్తుండడంతో తల్లిని తిట్టాడు. దీంతో తండ్రి కలగచేసుకుని వండుతుంది ఆగురా అని అన్నందుకు కుమారుడు తండ్రిపై బండి రాయితో దాడి చేయడంతో తండ్రి అక్కడికక్కడే పడి మృతిచెందాడు. తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీష్ తెలిపారు.