క్రైమ్/లీగల్

నాలుగు లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, జూలై 21: అక్రమంగా 80కిలోల గంజాయిని కారులో చాటుగా తరలిస్తున్న నింధితులను ఎన్‌డిపిఎస్ ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన శనివారం చోడవరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి సిఐ శంకరరావు అందజేసిన వివరాలిలావున్నాయి. వెస్ట్‌బెంగాల్‌కు చెందిన కృష్ణమండల (36), నందగోపాల్ (37), విజయ్‌డబ్నార్ (18)లు ఏజెన్సీ నుండి కారులో సుమారు నాలుగులక్షల రూపాయల విలువ చేసే 80కిలోల గంజాయిని అక్రమంగా వెంకన్నపాలెం వైపు తరలిస్తుండగా చోడవరం శివారులో ఎన్‌డిపిఎస్ డైరెక్టర్ కె. వేంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎఇఎస్ శ్రీలత ఆధ్వర్యంలోని ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. గంజాయితోపాటు కారును, నింధితులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసారు. నింధితులను రిమాండ్‌కు తరలించారు. ఈ దాడుల్లో ఎన్‌డిపిఎస్ ఎస్‌ఐ చంద్రవౌళి, చోడవరం సిఐ ఈశ్వరరావు, హెచ్‌సి ఓబులేసులు ఉన్నారు.