క్రైమ్/లీగల్

భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులూరు, జూలై 22: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన బల్లికురవ మండలం వైదన గ్రామ పంచాయతీ పరిధిలోని చవటిమాదిగపల్లెలో ఆదివారం జరిగింది. ఈ ఘటనలో పులి ఏసు దరియమ్మ(35) మృతి చెందింది. వివరాల్లోకి వెళితే యద్దనపూడి మండలం గన్నవరం గ్రామానికి చెందిన నాగుబాము ఏసు కుమార్తె ఏసుదయమ్మకు వైదన పంచాయతీలోని చవటిమాదిక పల్లెకు చెందిన పులి బుజ్జికి 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక ఆడ, ఇద్దరు మగ సంతానం ఉన్నారు. తాగుడకు బానిసైన పులి బుజ్జి తరచూ భార్య ఏసుదయ్మను వేధిస్తుండటంతో కొంతకాలం భార్య స్వగ్రామమైన గన్నవరంలో కాపురం ఉన్నారు. ఇటీవల వారి కాపురం తిరిగి చవటిమాదిగపల్లెకు మార్చారు. పుట్టింటి వారుకూడా ఏసు దయమ్మను బిడ్డల భవిష్యత్ కోసం భర్తతో సర్దుకు పోవాలని సర్దిచెప్పారు. ఈ నేపధ్యంలో చవటిమాదిగపల్లెకు కాపురం వచ్చినప్పటినుండి భర్త బుజ్జిలో ఎటువంటి మార్పు లేకపోవడంతో ఏసుదయమ్మ భర్త ప్రవర్తనపై విసుగుచెంది ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి నాగుబాము ఏసు ఫిర్యాదు మేరకు భర్త పులి బుజ్జిపై కేసు నమోదు చేసుకుని మృతురాలు ఏసు దయమ్మ మృతదేహనికి పంచనామా జరిపి పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బల్లికురవ ఎస్సై వై నాగరాజు తెలిపారు.