క్రైమ్/లీగల్

పదోతరగతి విద్యార్థినిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతలపూడి, జూలై 27: పశ్చిమగోదావరి జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. చింతలపూడి సాంఘిక సంక్షేమ వసతిగృహంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై మూడురోజులపాటు ఇద్దరు యువకులు అత్యాచారం జరిపిన వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. వసతి గృహంలో ఉండాల్సిన బాలిక యువకుల చెరలో ఉండటం, దీనిపై మేట్రిన్ సమాధానం చెప్పకుండా మొహం చాటేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. చింతలపూడి సాంఘిక సంక్షేమ వసతిగృహంలో పదవ తరగతి చదువుతున్న పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామానికి చెందిన విద్యార్థిని కనపడటం లేదంటూ ఈనెల 23న మేట్రిన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదుచేసి, పోలీసులు ఆరా తీయగా, ఆ విద్యార్థిని తల్లిదండ్రులు విడివిడిగా ఉంటున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈనెల 26వ తేదీ రాత్రి పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో బాలికను పోలీసులు గుర్తించారు. ఆరా తీయగా అదే గ్రామానికి చెందిన కిరణ్, చిట్టిబాబు బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసినట్టు నిర్ధారించారు.