క్రైమ్/లీగల్

లారీ బోల్తా : ముఠా కార్మికుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, జూలై 31: ముప్పాళ్ళ మండలంలోని నార్నెపాడు గ్రామానికి వెళ్తూ మార్గంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. లోడ్ లారీ అదుపుతప్పి నార్నెపాడు కాల్వలో బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముఠా కార్మికుడు మామిడి దుర్గారావు (40) మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థాలానికి చేరుకున్న ముప్పాళ్ళ పోలీసులు ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.