క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్కవరపుకోట, ఆగస్టు 4: మండలంలోని గంగుపూడి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆధిత్య కింతం నారాయణాచార్య(40) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎల్.కోట ఎస్సై ఎం.శ్రీనివాస్ అందించిన సమాచారం ప్రకారం మరణించిన వ్యక్తి గంగుపూడి గ్రామదేవత పరదేశమ్మ గుడి పూజారిగా పనిచేస్తూ అక్కడే గుడిపక్కన నివాసం ఉంటున్నారని, ఉదయం 7.30 ప్రాంతంలో రోడ్డుకు అవతలవైపు పొలాల్లోకి బహిర్భూమికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్న సందర్భంలో రోడ్డు దాటుతుండగా విశాఖ నుంచి అరుకు వెళుతున్న ఎపి-31 ఇక్యూ-9323 అనే నెంబరు గల కారు ఢీకొట్టడంతో ఆయన ముఖం నుజ్జునుజ్జు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంటనే ఎస్సై సంఘటనా స్థలానికి వచ్చి కారు డ్రైవరును అదుపులోకి తీసుకున్నామని, మరణించిన వ్యక్తి బావమరిది ఇరగవలస వెంకట సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టు మార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్సై ఎం.శ్రీనివాస్ తెలిపారు.