క్రైమ్/లీగల్

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోథ్ రూరల్, ఆగస్టు 4: మండలంలోని మందబొగడ గ్రామానికి చెందిన యువ రైతు సెడ్మకి మారుతి(33) శనివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మారుతి తనకు ఉన్న రెండెకరాల వ్యవసాయ భూమిలో పత్తి పంట సాగు చేస్తున్నాడు. పంట సాగుకు రూ.2లక్షలు అప్పు చేయగా ప్రకృతి వైపరిత్యాల కారణంగా ఆశించిన స్థాయిలో పత్తిపంట లేకపోవడంతో చేసిన అప్పులు ఏలా తీర్చాలో అనే బెంగతో వారం రోజులుగా మనస్థాపానికి గురయ్యాడని మృతుని భార్య రోదిస్తూ తెలిపింది. మారుతి ఆత్మహత్య యత్నం చేసుకోగానే తీవ్ర అస్వస్థతో ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై గంగారెడ్డి తెలిపారు.