క్రైమ్/లీగల్

వైద్యం కోసం వెళుతూ పైలోకాలకు....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, ఆగస్టు 5: మండల పరిధిలోని గోనిపేట క్రాస్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బెంగళూరు జేపీ నగర్‌కు చెందిన కమలమ్మ (76), అనిల్‌కుమార్ (50), ఆదిత్య (22)లు దుర్మరణం పాలయ్యారు. బెంగళూరు నుండి బళ్లారికి కమలమ్మకు వైద్యం చేయించేందుకు కారులో వెళుతుండగా ప్రమాదవశాత్తు ముందు వెళుతున్న లారీని ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకొంది. వీరు తరచూ ఆయుర్వేద చికిత్స నిమిత్తం బెంగళూరు నుండి బళ్ళారి వెళ్లే వారని బంధువులు తెలిపారు. అనిల్‌కుమార్ బెంగళూరులో వ్యాపారం చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు రక్తసంబంధీకులే. కమలమ్మ కుమారుడు అనిల్‌కుమార్ కాగా అనిల్‌కుమార్ కుమారుడు ఆదిత్య. ఆదిత్య ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మృతుడు అనిల్‌కుమార్ భార్య గాయిత్రమ్మ, మరో కుమార్తె ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదంలో మృతి చెందడం స్థానికులను కలచి వేసింది. విషయం తెలిసిన వెంటనే ఎస్సై జనార్ధన్ సంఘటనా స్థలాన్ని చేరుకొని కారులో కూరుకుపోయిన మృతదేహాలను క్రేన్ సహాయంతో బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమయింది. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.