క్రైమ్/లీగల్

వాగులో కొట్టుకుపోయి పశువుల కాపరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టేకులపల్లి, ఆగస్టు 13: పశువులను మేపడానికి వెళ్లిన కాపరి వాగులో జారిపడి కొట్టుకుపోయి మృతి చెందాడు. ఈ సంఘటన బోడు పోలీసు స్టేషన్ పరిధిలోని మొక్కంపాడులో సోమవారం జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం మొక్కంపాడుకు చెందిన ఈసం సమ్మయ్య (48) మేత మేపడానికి తన ఆవులను ఇంటి నుండి తోలుకొని వెళ్లాడు. సమీపాన గల ధరంపురేవు వాగు (పెద్దవాగు) వైపు ఆవులు వెళ్తుండగా వాటిని అదిలించే క్రమంలో సమ్మయ్య జారిపడిపోయాడు. ఉధృతంగా వాగు ప్రవహిస్తుండటంతో కొట్టుకుపోయాడు. వెనకాల వస్తున్న అదే గ్రామానికి చెందిన ఇతర పశువుల కాపరులు ఆవులు కన్పించి సమ్మయ్య కనిపించకపోవడంతో అనుమానం వచ్చి వాగు వైపు చూశారు. చాలా దూరంలో సమ్మయ్య కొట్టుకుపోతుండటాన్ని చూశారు. వెంటనే గ్రామస్తులకు ఫోన్ ద్వారా తెలిపి వెతికారు. రెండు గంటల తరువాత శవమై కనిపించాడు. బోడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి బోడు పోలీసులు చేరుకున్నారు. మృతుడికి భార్య ఎర్రమ్మ, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. బోడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.