క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, ప్రాణాపాయ స్థితిలో భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, ఆగస్టు 13: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా ప్రాణాపాయ స్థితిలో వైద్యశాలో భర్త చికిత్స పొందుతున్న సంఘటన తెనాలి రూరల్ మండలం కొలకలూరు గ్రామ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం కొలకలూరు గ్రామానికి చెందిన కలకండ మాధవి ఓప్రైవేటు విద్యాసంస్థలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈక్రమంలో సోమవారం భార్య మాధురిని ఇంటికి తీసుకువస్తున్న భర్త శేషయ్య మోటారు బైకును నందివెలుగు- గుంటూరు రహదారిపై కొలకలూరు గ్రామసెంటర్‌లో ట్రాక్టర్ డీకొంది. ఈసంఘటనతో తీవ్ర గాయాలైన మాధురి, శేషయ్యలను స్థానికులు తెనాలి జిల్లా వైద్యశాలకు తరిలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాధరి (28) మృతి చెందగా భర్త శేషయ్యను ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలికి నాలుగు మాసాల కొడుకుతోపాటుగా ఓకుమార్తెఉంది. రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక సమాచారం అనంతరం ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని మాధురి మృతదేహాన్ని పరిశీలించారు. ఆ తరువాత భర్త శేషయ్య చికిత్స పొందుతున్న ప్రైవేటు వైద్యశాలకు చేరుకుని సంఘటన వివరాలు సేకరించారు. బంధువుల ఫిర్యాదు మేరకు తెనాలి రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు, ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.