క్రైమ్/లీగల్

భూమికోసం భార్యను కడతేర్చిన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతానగరం, ఫిబ్రవరి 23: చెడు వ్యసనాలకు బానిసైన భర్త భార్యను ఆస్తి కోసం కడతేర్చిన హృదయవిదారక సంఘటన మండలంలోని జగ్గునాయుడుపేట (ఆర్.వెంకంపేట) గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించి మృతురాలి తండ్రి సీతానగరం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఎస్‌ఐ సాయికృష్ణ వివరాల ప్రకారం ఆర్.వెంకంపేట గ్రామానికి గులిపల్లి ఈశ్వరరావు, సత్యవతిలకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈశ్వరరావు గత మూడేళ్లుగా భార్యతో గొడవలు పడడంతోపాటు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ సమయంలో ఈశ్వరరావు వాటాకు సంబంధించిన ఎకరంనర పంట భూమి పిల్లల పేరున పెద్దల సమక్షంలో రాయించారు. అయితే ఇది తట్టుకోలేని ఈశ్వరరావు గురువారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. ఆ భూమిని తన పేరున రాయించాలని ఘర్షణ పడ్డాడు. అర్ధరాత్రి అందరూ పడుతున్న సమయంలో భార్య సత్యవతి(37) గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం శుక్రవారం ఉదయం సీతానగరం పోలీసు స్టేషన్‌కు వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న బొబ్బిలి డిఎస్పి సౌమ్యలత, బొబ్బిలి రూరల్ సిఐ బిఎండి.ప్రసాద్, ఎస్‌ఐ సాయికృష్ణలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి పంచనామా నిమిత్తం తరలించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు సీతానగరం ఎస్‌ఐ సాయికృష్ణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
నింధితులను కఠినంగా శిక్షించాలి-ఐద్వా:
మహిళలపై రోజురోజుకు అకృత్యాలు పెరుగుతున్నాయని, ఇందులో దోషులైన వారిని కఠినంగా శిక్షించాలని ఐద్వా మండల కార్యదర్శి వెనె్నల రామలక్ష్మి డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందుకు సంబంధించి తహశీల్దార్ అప్పలరాజుకు వినతిపత్రం అందజేశారు. సత్యవతి మృతికి సంబంధించిన కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.