క్రైమ్/లీగల్

మూడు టన్నుల ఎర్ర చందనం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టంగుటూరు, ఆగస్టు 14 : మండల కేంద్రమైన టంగుటూరులోని బీసీ కాలనీకి చెందిన చేజర్ల దత్తాత్రేయ , ఉల్లిమిదల దత్తాత్రేయ ఇంట్లో మూడు టన్నుల ఎర్ర చందనం స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు డిఎస్‌పి బి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో డిఎస్‌పి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనం విలువ 30 లక్షల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. నిందితులను పోలీసులు విచారించగా పాత కొస్టాలను కొనుగోలు చేసిన వాటిలో ఎర్ర చందనం గుర్తించి చెన్నైకి చెందిన ఇస్మాయిల్, ఖాదర్‌బాషాకు అమ్మేవారమని నిందితులు తెలిపాయని డియస్‌పి వెల్లడించారు. ఎర్రచందనం దుంగలను కలిగి ఉండటం, వాటిని అమ్మడం నేరంగా భావించి వారిద్దరినీ అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు డిఎస్‌పి తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్ చేసిన సింగరాయకొండ సీఐ దేవ ప్రభాకర్, స్థానిక ఎస్‌ఐ హజరత్తయ్య, పోలీస్ సిబ్బంది లను డిఎస్‌పి అభినందించారు. ఈ విలేఖర్ల సమావేశంలో సింగరాయకొండ సీఐ దేవ ప్రభాకర్, టంగుటూరు ఎస్‌ఐ హజరత్తయ్య, స్టేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు.