క్రైమ్/లీగల్

బ్యాంకు మేనేజర్‌కు జైలు, జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 23: చిన్నకారు రైతుకు రుణం మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన బ్యాంకు మేనేజర్‌కు విశాఖలోని సీబీఐ కేసులు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జి.సత్యప్రభాకర్ జైలు, జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం కాకరాలపుట్టు గ్రామానికి చెందిన రైతుకు పాడిపరిశ్రమ నిమిత్తం రూ.2 లక్షల రుణం మంజూరైంది. మంజూరైన రుణం విడుదల చేసేందుకు శ్రీకాకుళం జిల్లా సోంపేట ఆంధ్రాబ్యాంకు మేనేజర్ అక్షయ్‌కుమార్ సాహు రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ అంశాన్ని బాధితుడు ఏసీబీ దృష్టికి తీసుకురాగా, బ్యాంకు మేనేజర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో బ్యాంకు మేనేజర్ సాహుకు ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.8000 అపరాధ రుసుం చెల్లించాల్సిందిగా తీర్పు చెప్పారు.