క్రైమ్/లీగల్

బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 23: మత్తుమందు కలిపిన బిస్కెట్లు ఇచ్చి బాలికపై అత్యాచారం జరిపాడు ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ భర్త. దీంతో ఆ చిన్నారి గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణం కర్నూలు నగరంలో వెలుగుచూసింది. పోలీసులు, బాధితురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు నగరంలోని రామలింగేశ్వరనగర్‌లో శివరామిరెడ్డి(50), అతని భార్య (హెడ్ కానిస్టేబుల్) నివసిస్తున్నారు. వారి ఇంట్లో ఓ 12 ఏళ్ల బాలిక పనిచేస్తోంది. ఆ బాలిక సోదరి(14) అప్పుడప్పుడు వీరి ఇంటికి వచ్చిపోతుండేది. చెల్లి లేనప్పుడు తానే ఇంటి పనులు చేసేది. దీన్ని అవకాశంగా తీసుకున్న శివరామిరెడ్డి బాలికకు మత్తుమందు కలిపిన బిస్కెట్లు ఇచ్చేవాడు. బాలిక స్పృహ కోల్పోయాక అత్యాచారం జరిపాడు. ఇలా రెండు నెలల్లో పలుసార్లు బాలికపై అత్యాచారం జరిపాడు. గత మంగళవారం మత్తు బిస్కెట్లు ఇచ్చి బాలికపై అత్యాచారం జరిపాడు. మెళకువ వచ్చిన బాలిక తనపై అఘాయిత్యం జరిగినట్లు తెలుసుకుని తల్లికి విషయం చెప్పింది. అత్యాచారం జరిపిన వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ భర్త కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడారు. అయితే చివరకు ధైర్యం చేసి ఎస్పీ గోపీనాథ్ జెట్టీ దృష్టికి తీసుకువచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ వెంకటాద్రి ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బాధితురాలిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపగా గర్భం దాల్చినట్లు తేలింది. నిందితుడు శివరామిరెడ్డిని అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ వెంకటాద్రి తెలిపారు.