క్రైమ్/లీగల్

రాహుల్ వ్యాఖ్యలపై కోర్టులో ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముజఫర్‌పుర్ (బిహార్), ఆగస్టు 25: భారత్ కీర్తి ప్రతిష్టలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాందీపై స్థానిక కోర్టులో ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు. రాహుల్‌గాంధీపై పరువునష్టం దావా కేసును సుధీర్ కుమార్ ఒజా అనే న్యాయవాది దాఖలు చేశారు. ఈ కేసును చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కార్యాయలంలో దాఖలు చేశారు. ఈ కేసు సెప్టెంబర్ 4వ తేదీన విచారణకు రానుంది. జర్మనీ పర్యటనలో ఒక సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ నిరుద్యోగం వల్లనే ఇస్లామిక్ స్టేట్ వ్యాపించిందని, ఇదే పరిస్థితి భారత్‌లో కూడా తలెత్తుతుందని చెప్పారన్నారు. భారత్‌లో ఉగ్రవాదం పెరుగుతోందని అర్థం వచ్చే విధంగా మాట్లాడారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. భారత్ ప్రతిష్టను తక్కువ చేసి విదేశాల్లో రాహుల్ గాంధీ మాట్లాడారన్నారు. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలకు తాను మానసికంగా గాయపడ్డానన్నారు. రాహల్‌గాంధీపై ఆపీసీ 153బీ, ఐపీసీ 500, ఐపీసీ 504 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.