క్రైమ్/లీగల్

సహచరుడే చంపాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కపల్లి, ఆగస్టు 27: తోడుగా ఉన్న క్లీనర్‌నే డ్రైవర్ కర్కశంగా హత్య చేశాడు. మండలంలోని కాగిత జంక్షన్ సమీపంలో సోమవారం లారీ డ్రైవర్ లారీడ్రైవర్ మరకట్ల డానియల్ (51), ( పశ్చిమ గోదావరి జిల్లా) అదే లారీలో పనిచేస్తున్న క్లీనర్ తాడి విజయ్‌కుమార్ (45)ను ఒక పథకం ప్రకారం హత్యచేశాడు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుండి రొయ్యపొట్టు లోడ్‌చేసుకుని విశాఖపట్నం తీసుకువస్తున్నా డు. డ్రైవర్ డానియల్‌కు క్లీనర్ విజయ్‌కుమార్ (45)కు మార్గమధ్యంలో తుని వద్ద ఘర్షణ జరిగింది. క్లీనర్ విజయ్‌కుమార్‌ది తుని వద్ద ఘర్షణ జరిగింది. విజయ్‌కుమార్ పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరకువాడ. వీరిరువురి మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారి ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. ఆ తరువాత అక్కడకు సమీపంలోని స్థానికులు వీరివురిని విడిపించి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. లారీ టైర్లలో గాలి నింపేందుకు నక్కపల్లి మండలం కాగిత టోల్‌గేట్ వద్ద డ్రైవర్ నిలిపాడు. లారీచక్రాలు తనిఖీ చేయించి గాలినింపారు. అనంతరం కాగిత జంక్షన్ వద్ద మళ్లీ లారిని జాతీయ రహదారిపై నిలుపుదల చేసి మరోసారి గాలి తనిఖీ చేయమని క్లీనర్ విజయ్‌కుమార్ కిందకు పంపించాడు. క్లీనర్ తనిఖీ చేసి టైర్లన్నీ బాగానే ఉన్నాయని, గాలి పూర్తిగా ఉన్నందున లారీ వెళ్లనీయమని క్లీనర్ చెప్పాడు. ఆ తరువాత మరోసారి క్లీనర్‌ను లారీ కిందకు వెళ్లి స్టెపిని టైర్‌ను తనిఖీ చేసి రమ్మని క్లీనర్‌ను లారీ కిందకు దింపాడు. క్లీనర్ లారీ కిందకు వెళ్లి తనిఖీ చేస్తుండగా అప్పటికే క్లీనర్‌తో తీవ్ర కొట్లాటకు దిగిన డ్రైవర్ కోపోద్రిక్తుడై ఉన్న పళంగా లారీని క్లీనర్‌పై నుండి నడపటంతో క్లీనర్ రెండుకాళ్లు విరిగిపోయాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఇక్కడకు వచ్చి అపస్మారక స్థితికి చేరుకున్న క్లీనర్‌ను సమీపంలోని నక్కపల్లి ఫ్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్లీనర్‌ద్వారా జరిగిన విషయాన్ని పోలీసులు అడిగి తెలుసుకున్నారు. క్లీనర్‌ను విశాఖపట్నం కెజిహెచ్‌కు తరలించగా క్లీనర్ విజయ్‌కుమార్ అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న క్లీనర్ కుమారుడు దాడి కరుణాకర్ హుటాహుటిన ఇక్కడకు వచ్చి తన తండ్రిని లారీడ్రైవర్ డానియల్ ఉద్దేశపూర్వకంగా కక్షతో హత్య చేసాడని ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ మేరకు నక్కపల్లి సిఐ రుద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.