క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో పెళ్లి బృందానికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంకి, ఆగస్టు 30 : అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై గురువారం ఉదయం పెళ్లి బృందానికి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఒంగోలుకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచికి చెందిన వధూవరులకు తిరుమలలో వివాహం చేశారు. అనంతరం పెళ్లి బృందం తిరుమల నుంచి తుఫాన్ వ్యానులో తిరిగి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా అద్దంకి మండలం కొంగపాడు డొంకవద్ద ప్రమాదం జరిగింది. తుఫాన్ వ్యానుడ్రైవర్ వెంకటవీరాంజనేయులు నిద్రమత్తులో రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో వ్యాను తిరగబడింది. ఈ ఘటనలో డ్రైవర్ వీరాంజనేయులుతో పాటు వ్యానులో ఉన్న భారతికి చేయి విరిగింది. సుబ్బాయమ్మ, గోవిందమ్మ, మంగమ్మ, శివప్రసాద్, నవశ్రీలకు గాయాలుకాగా వారిని 108 వాహనంలో ఒంగోలుకు తరలించారు. అద్దంకి ఎస్సై సుబ్బరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.