క్రైమ్/లీగల్

గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకరావుపేట, ఆగస్టు 30: మండలంలో రాజనగరం సముద్ర తీరంలో స్నానానికి వెళ్ళి ఇద్దరు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి తుని ఫ్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న కొంత మంది విద్యార్థులు ఆటోలో రాజనగరం సముద్రతీరంకు స్నానానికి వెళ్ళగా వీరిలో గోరంటి రాజు(19) కోటవురట్ల మండలం శరభవరం కాగా, తుని పట్టణానికి చెందిన పైల వెంకటసాయిరామ్(19)లు సముద్రంలో గల్లంతయ్యారు. ఈమేరకు గురువారం ఉదయం రాజు మృత దేహం సంఘటనా స్థలానికి దగ్గర్లో లభ్యమైంది. సాయిరామ్ మృతదేహం నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద లభ్యమైందని ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఈమేరకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.