క్రైమ్/లీగల్

కుటుంబ కలహాలతో విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్రంకొండ, సెప్టెంబర్ 2. గుర్రంకొండ మండలం ఎల్లుట్ల పంచాయతీకి చెందిన పసలవాండ్లపల్లెకు చెందిన విద్యార్థిని (17) శనివారం అర్థరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా వున్నాయి. ఎల్లుట్ల పంచాయతీ పసలవాండ్లపల్లె కు చెందిన అగ్గి రామాంజనేయులు కుమార్తె గుర్రంకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇంట్లో కుటుంబ కలహాలను ఓర్వలేక అర్థరాత్రి ఇంట్లో అందరూ నిద్రలో వుండగా విద్యార్థిని ఇంట్లో వున్న పురుగుల మందు తాగి కొట్టుమిట్టాడుతుండగా ఇంటిలో వారు వెంటనే మదనపల్లె ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రి వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. తిరుపతికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందింది. శవాన్ని గుర్రంకొండ ఎస్‌ఐ నరేష్ వాల్పీకిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేశామని ఎస్‌ఐ నరేష్ తెలిపారు.