క్రైమ్/లీగల్

ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో టాక్సీ డ్రైవర్ ఉరివేసుకుని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 2 : ఒక టాక్సీ డ్రైవర్ ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు నేపధ్యంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక గొల్లాయిగూడెంనకు చెందిన ఎండి ఇబ్రహీం ఖాన్ (39) టాక్సీ డ్రైవర్‌గా జీవిస్తున్నాడు. అతని సోదరుడు మహ్మద్ ఆలీ ఖాన్‌తో కలిసి ఒక కారును కొనుగోలుచేశాడు. ఆ కారు ఇటీవల అపహరణకు గురైంది. అయితే ఇబ్రహీం ఖాన్ ఇంటి వద్ద కారు పోయిందని, ఫిర్యాదుచేశానని తెలియజేశాడు. అయితే ఆ మాటలు నమ్మకుండా కారు అమ్ముకున్నావని, పోలేదంటూ వేధిస్తున్నారు. అంతేకాకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని సోదరుని భార్య అనడంతో మనస్తాపానికి గురై ఆదివారం తెల్లవారుజామున స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని వాటర్ మెట్లు ఎక్కి మెడకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న టుటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.