క్రైమ్/లీగల్

యలమంచిలి సమీపంలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యలమంచిలి, సెప్టెంబర్ 2: మండలంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జూమున జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. యలమంచిలి రూరల్ ఎస్‌ఐ డి. రాము కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన కేటరింగ్ సిబ్బంది విశాఖపట్నం మధురువాడలో ఒక ఫంక్షన్ చూసుకొని తిరిగి హైదరాబాద్ వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న మినీబస్సు యలమంచిలికి సమీపంలో రేగుపాలెం వద్ద జాతీయ రహదారిలో పక్కన ఆగి ఉన్న లోడ్‌లారీని వేగంగా వస్తు ఢీకొంది. ఈ దుర్ఘటనలో మినీబస్సులో ఉన్న సుమారు 8మంది ప్రయాణికుల్లో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని స్ధానికులు, హైవే పెట్రోలింగ్, 108వాహనం ద్వారా యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ వైద్యుల సూచనలవేరుకు అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా గాయపడినవారిలో రాజస్థాన్‌కు చెందిన జయరాం చౌదరి (32), వెస్ట్‌బెంగాల్‌కు చెందిన సౌరబ్ గోష్ (23)లు మృతి చెందారన్నారు. విషమపరిస్థితిలో ఉన్న బైపు పౌల్ (32) (కలకత్తా) కేజిహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. జానీ సతీష్, సాయిబా సాయిదాస్ అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో చిక్సితలు పొందుతున్నారు. ఈ ప్రమాదంపై యలమంచిలి రూరల్ ఎస్‌ఐ డి. రాము ఆధ్వర్యంలో కేసు దర్వాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్టు ఎస్‌ఐ రాము తెలిపారు.