క్రైమ్/లీగల్

చర్చి పాస్టర్ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, సెప్టెంబర్ 2: కుమార్తె ఈడు అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్న చర్చి పాస్టర్‌ను మైలవరం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసుల కధనం ప్రకారం జి కొండూరు మండలం కందులపాడుకు చెందిన మందా శామ్యూల్ వెలగలేరు మెట్రోపాలిటన్ చర్చిలో పాస్టర్‌గా సేవలందిస్తున్నాడు. ఇతనికి వివాహమై 20 ఏళ్ళ కుమార్తె కూడా ఉంది. ఈక్రమంలో భక్తిమాటున చర్చికి వస్తున్న రోజా అనే 21 ఏళ్ళ యువతితో చనువుగా ఉండటం మొదలెట్టాడు. ఈ విషయాన్ని యువతి తల్లి గమనించి పరువు పోతుందనే భయంతో కుమార్తెకు నచ్చ చెప్పుకుని గత నెల 29న మైలవరం మండలం గణపవరంలోని తన అన్న ఇంటికి తీసుకొచ్చింది. ఐనప్పటికీ శ్యామ్యూల్ ఆ యువతిని వదలలేదు. తల్లి, కూతుళ్ళు గణపవరం వెళ్ళిన అదే రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్యామ్యూల్ అక్కడికి వెళ్ళి తల్లిని గాయపరిచి యువతిని తనతో బలవంతంగా తీసుకువెళ్ళాడు. భయాందోళనకు గురైన తల్లి దీంతో స్థానిక పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్‌ఐ జి రామకృష్ణ నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేసి స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు.