క్రైమ్/లీగల్
పురుగుమందు తాగి యువతి ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 16 September 2018
గజపతినగరం, సెప్టెంబర్ 16: పురుగు మందు తాగి బడేవలస గ్రామానికి చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం సాయంత్రం గజపతినగరంలో చోటు చేసుకుంది. సంఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. మెంటాడ మండలం బడేవలస గ్రామానికి చెందిన యవర్న గౌరీశ్వరి(19) గజపతినగరంలోని మెంటాడ రోడ్డులో పురుగులు మందు సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. దీంతో పరిసర ప్రాంతాల వారు హుటాహుటిన వైద్య చికిత్స కోసం గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. గౌరీశ్వరి ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.