క్రైమ్/లీగల్

చంద్రబాబు అవినీతిపై పిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ల ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజావ్యాజ్య పిటీషన్‌ను హైకోర్టు స్వీకరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నారా లోకేష్, వేమూరి రవికుమార్‌లు డొల్ల కంపెనీలకు అనుమతి ఇచ్చారని, తద్వారా పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని, ఈ అక్రమాలపై సీబీఐ, ఈడీ సంస్థలతో దర్యాప్తు జరిపించాలని ‘ముందడుగు’ ప్రజాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ న్యాయమూర్తి జె శ్రవణ్‌కుమార్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందుకు ఈ పీటీషన్ మంగళవారం విచారణకు రానున్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వ అవినీతిపై మాజీ న్యాయమూర్తి స్వయంగా వాదనలు వినిపించబోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.