క్రైమ్/లీగల్
క్యాష్ బ్యాగ్ చోరీ: ఇద్దరు దొంగల అరెస్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఉప్పల్, సెప్టెంబర్ 25: పెళ్లిలో క్యాష్ బ్యాగ్ చోరీ కేసులో తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు దొంగలను మేడిపల్లి క్రైం పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద రూ.2.5లక్షల విలువైన 6.8తులాల బంగారం, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఏసీపీ గోనె సందీప్ ఇన్స్పెక్టర్లు బీ.అంజి రెడ్డి, దేవేందర్తో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. బాలాపూర్ సంజీవ్నగర్లో నివసిస్తున్న కర్నూల్ జిల్లా నంద్యాలకు చెందిన హార్డ్వేర్ దశర్బంద్ షఫీ (34), ఎల్బీనగర్ బండ్లగూడలో నివసిస్తున్న పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి కాసర్ల శ్రీకాంత్ (26) పాత నేరస్తులు. గత నెల 26వ తేదీన బోడుప్పల్ రోడ్డులో ఉన్న పద్మావతి ఫంక్షన్ హాల్లో పెళ్లికి వచ్చిన పీర్జాదిగూడ మల్లిఖార్జున్నగర్కు చెందిన సతీష్ కుటుంబ సభ్యుల నుంచి క్యాష్, గోల్డ్ బ్యాగ్ను దొంగిలించారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని క్రైం ఇన్స్పెక్టర్ దేవేందర్ ఆధ్వర్యంలో దర్యాప్తు వేగం చేశారు. సీసీ పుటేజ్ ఆధారంగా గుర్తించిన నిందితులను మంగళవారం వెహికిల్ చెకింగ్లో పట్టుబడ్డారు. బ్యాగ్లో ఉన్న రెండు లక్షల నగదు ఖర్చు చేయగా, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ సందీప్ పేర్కొన్నారు.