క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, సెప్టెంబర్ 27: తిరుపతి రూరల్ మండలం కాలూరు బైపాస్‌రోడ్డు కొప్పరవాండ్లపల్లి వద్ద కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఈ సంఘటనలో తిరుపతి సింగాలగుంటకు చెందిన సుధీర్ (26), దామోదరంలు అక్కడికక్కడే మృతిచెందగా, రమేష్, జయప్రకాష్, చరణ్ అనే ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి రుయాసుపత్రికి తరలించారు. తిరుపతి బోత్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సుధీర్ అర్ధరాత్రి తన స్నేహితులతో కలసి సరదాగా కారులో తిరుపతి నుండి శ్రీనివాసమంగాపురం వైపు వెళుతుండగా, కారు వేగంగా చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందగా, గాయపడిన ముగ్గురిని 108 వాహనంలో తిరుపతి రుయాసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. ముత్యాలరెడ్డిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.