క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఉప్పల్, సెప్టెంబర్ 27: త్రిబుల్ రైడింగ్ రోడ్డు ప్రమాదానికి దారితీసింది. ఈ ఘటనలో ఎంబీఏ విద్యార్థిని దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బోడుప్పల్ లక్ష్మీనగర్లో నివసిస్తున్న పీ.వెంకట సంధ్యారాణి (22) ఘట్కేసర్లోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ చదువుతోంది. భర్త సత్య, అతని స్నేహితుడు భాస్కర్తో కలిసి గురువారం ఉదయం బైక్పై వెళ్లి చెంగిచర్ల చౌరస్తాలో పెట్రోల్ పోసుకుని ఆమెను కళాశాలలో దింపేందుకు తిరిగి రిటర్న్ అవుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. వెనుక టైర్ల కింద పడిన సంధ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించింది. భర్త సత్య, స్నేహితుడు భాస్కర్కు గాయాలయ్యాయి. మృతురాలు సంధ్యారాణి ఇటీవలనే సత్యను ప్రేమ పెళ్లి చేసుకుందని సమాచారం. కుటుంబ సభ్యుల రోదనలు అందరి హృదయాలను కదిలించాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి యువతి మృతికి కారణమైన డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు.