క్రైమ్/లీగల్

వేటగాళ్ల ఉచ్చుకు.. ఇద్దరు బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్యాల, సెప్టెంబర్ 27: మల్యాల మండలం నూకపల్లి శివారు గాడుదల గుట్ట ప్రాంతంలో గురువారం రెండు మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. వీరిద్దరూ గొల్లపల్లి మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన వెల్మల ఉమారాణి (40), గాదె కిరణ్‌కుమార్ (31)గా పోలీసులు గుర్తించారు. వేటగాళ్లు వన్యప్రాణుల కోసం ఏర్పా టు చేసిన కరెంట్ తీగెలపై మృతులు పడి ఉండడంతో బలైనట్లుగా స్థానికులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉమారాణి తప్పిపోయినట్లుగా ఆమె భర్త గత సోమవారం గొల్లపల్లి, జగిత్యాల పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయగా ఆమెపై మిస్సింగ్ కేసు నమోదైంది. ఒకే ఊరికి చెందిన వీరిద్దరు బైక్‌పై వచ్చి గుట్ట ప్రాంతంలో మృత్యువాత పడడం వివిధ రకాలుగా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఉమారాణి భర్త రాజేంద్రప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు సీఐ నాగేందర్‌గౌడ్ తెలిపారు. శవపంచనామా జరిపి పోస్టుమార్టం చే యించి బంధువులకు అప్పగించినట్లు ఎస్సై మిథున్‌కుమార్ తెలిపారు.