క్రైమ్/లీగల్

నకిలీ పాసుపుస్తకాల కేసులో ఇద్దరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, సెప్టెంబర్ 28 : నకిలీ పాసుపుస్తకాల కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ మన్నూరుద్దీన్ తెలిపారు. శుక్రవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకల్లు మండల కేంద్రంలో ఈనెల 26న పోలీసులు దాడి చేయడంతో దొరికిన నకిలీ పాసు పుస్తకాల కేసుకు సంబంధించి శివశంకర్ జిరాక్స్ సెంటర్ యజమాని శివశంకర్‌తోపాటు గంగులప్పను అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు స్వామీతోపాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. వీరిని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు. నిందితులందరిపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేయడంతోపాటు రెవెన్యూ అధికారుల పాత్ర ఏమైనా ఉందా? అన్న కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు. నిందితులతోపాటు ఓ కంప్యూటర్, జిరాక్స్ మిషన్, 12 పట్టాదారు పాసుపుస్తకాలు, సీళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇదివరకే ఎవరైనా నకిలీ పాసుపుస్తకాలు పొంది బ్యాంకుల్లో రుణాలు ఏమైనా పొందారా? అన్న కోణంపై కూడా విచారణ చేస్తున్నామని తెలిపారు. రుణాలు తీసుకొని వుంటే ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. సమావేశంలో తనకల్లు ఎస్‌ఐ నాగేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.