క్రైమ్/లీగల్

విద్యుత్‌షాక్‌తో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామన్నపేట, సెప్టెంబర్ 28: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌గురై రైతు మృతిచెందిన ఘటన మండలంలోని జనంపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్థులు, మృతునికి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జనంపల్లి గ్రామానికి చెందిన రైతు ఎర్రబోయిన కోటయ్య (60) తెల్లవారుజామున తన పొలం వద్దకు వెళ్లాడు. గేదేపాలు పిండడానికి పొలం గట్టుమీదుగా వెళ్తుండగా స్టాటర్ నుండి మోటారు వరకు అమర్చిన సర్వీస్‌వైర్ తేలిఉండటం వల్ల విద్యుత్ పాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి వివాహితులైన నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. మృతదేహాన్ని రామన్నపేట ఏరియాసుపత్రికి తరలించి పోస్టుమార్టన్ నిర్వహించారు. మృతుని కుమారుడు ఎర్రబోయిన మత్స్యగిరి ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్‌ఐ హన్మంతరావు తెలిపారు.