క్రైమ్/లీగల్

రైలు ఢీకొని వివాహిత మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి(రూరల్), సెప్టెంబర్ 29: రైలు ఢీకొని వివాహిత మృతిచెందిన సంఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి రైల్వే పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలం గున్నతోటవలస గ్రామానికి చెందిన కె కళావతి(55) శనివారం ఉదయం పశువులను మేపునకు తరలిస్తు రైల్వేట్రాక్‌ను దాటుతుండగా బొబ్బిలి నుంచి విశాఖ గూడ్స్ రైలు ఇంజన్ వెళ్లడాన్ని గమనించకపోవడంతో ఢీకొంది. దీంతో కళావతి అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి భర్త నరిసింహులతోపాటు కుమారులు పోలినాయుడు, రమేష్‌లున్నారు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.