క్రైమ్/లీగల్

ఆటో నుంచి జారిపడి విద్యార్థిని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దండేపల్లి, అక్టోబర్ 1: దండేపల్లి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన కుదురు పాక మంగ (16) అనే విద్యార్థిని ప్రమాదవశాత్తు ఆటో నుండి జారి పడి సోమవారం మృతి చెందినట్లు దండేపల్లి ఎస్సై సంజీవ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మంగ రెబ్బెన పల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుందని సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు తోటి విద్యార్థులతో కలిసి ఆటోలో వెళ్తుండగా ఆటో నుండి జారి కింద పడటంతో అక్కడిక్కడే మృతి చెందిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.