క్రైమ్/లీగల్

పోస్టుమార్టంపై హైకోర్టు ఆదేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: సుప్రీం కోర్టు, మానవ హక్కుల సంఘాలు గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మావోయస్టుల మృతదేహాలను తరలించిన భద్రాచలం ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అలాగే, పోస్టుమార్టంను వీడియోలో చిత్రీకరించాలని సూచించింది. చత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలంటూ హైకోర్టులో శుక్రవారం లంచ్ మోషన్ పిటీషన్‌ను పౌర హక్కుల సంఘం నేతలు దాఖలు చేశారు. పిటీషన్‌ను విచారించిన హైకోర్టు, మృతదేహాలకు న్యాయ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టమ్ నిర్వహించాలని ఆదేశించింది.