క్రైమ్/లీగల్
రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డిపై రూ. 200 కోట్ల పరువునష్టం దావా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 24 October 2018
తిరుపతి, అక్టోబర్ 23: శ్రీవారి ఆలయానికి సంబంధించిన పలు అంశాలపై ఆరోపణలు చేసిన ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు ఏవీ రమణ దీక్షితులు, ఎంపీ విజయ్సాయి రెడ్డిలపై టీటీడీ రూ. 200 కోట్లకు పరువు నష్టం దావాను తిరుపతి 10వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో వేసింది. టీటీడీ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో పరువు నష్టం దావా దాఖలు చేసిన దాఖలాల్లేవు. ఈనెల 8వ తేదీన తిరుపతి 10వ అదనపు జిల్లా కోర్టులో టీటీడీలో వాజ్యం వేయగా 9వ తేదీన న్యాయ స్థానం కేసును నమోదు చేసింది. ఈకేసు నవంబర్ 13వ తేదీన విచారణకు రానుంది. టీటీడీ తరపున వీ.్ధనంజయ వర్మ కేసును వాదిస్తున్నారు.